ఇటలీకి చెందిన కార్ల కంపెనీ ఫెరారి నుండి అత్యంత విలువ గల కార్లను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఫెరారీ జీటీసీ4లూసో, జీటీసీ4లూసో టీ మోడల్ కార్లను ఈరోజే మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. లగ్జరీ అనే అర్ధం వచ్చేలా లూసో అని ఈ రెండు కార్లకు పెట్టారు. ఇక ఫెరారీ జీటీసీ4లూసో ధర 5.20కోట్ల ఎక్స్ షో రూం ప్రైజ్ తో అందుబాటులోకి వస్తుంది.
681బీహెచ్పీ, 697 ఎన్ఎం పీక్ టార్క్ తో ఇంజిన్ కెపాసిటీ ఉంటుంది. 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో ఈ వెహికల్ అందుబాటుక్లోకి వస్తుంది. లక్సరీ వెహికల్స్ లో కొత్తగా వచ్చిన ఫెరారి ఓ సరికొత్త ప్రభంజనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు.