మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ నుండి మిని ట్రాక్టర్ జివో రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరులో రిలీజ్ చేసిన ఈ మిని ట్రాక్టర్లు త్వరలోనే అన్ని ఏరియాలలోకి వస్తాయని తెలుస్తుంది. నాలుగు చక్రాలకు ఒకేసారి ఫోర్స్ అందించే ఫోర్ వీల్ డ్రైవ్ దీని వల్ల జరుగుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. 24 హెచ్పి ఇంజిన్ సామర్ధ్యంతో వస్తున్న ఈ మిని ట్రాక్టర్ 4 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో అందుబాటులో ఉంది.


ఈ అక్టోబర్ నవంబర్ లో ఈ మిని ట్రాక్టర్ మహింద్రా జివొని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లోకి వస్తున్న ఈ మిని ట్రాక్టర్లు సరికొత్త ఒరవడిని సృష్టిస్తాయని చెప్పొచ్చు. మహింద్రా జివో మహింద్రా ట్రాక్టర్స్ లానే సేల్స్ కలిగి ఉంటాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: