ఇంట్లో పెరుగు ఉంటే సౌందర్యం మీ వెంటే అంటున్నారు ఆహారనిపుణులు. ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో రకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా ఇస్తాయి. అదెలాగో చూద్దాం! పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి మెడకు చేతులకు పట్టించి ఓ 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతివంతం అవుతాయి.


తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే. మళ్ళీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలపి పూసినా చక్కని కండీషనర్ లాగా ఉపయోగపడుతుంది.


-పెరుగులో శనగపిండిని కలిపి, నలుగుపిండిలా శరీరానికి పట్టిస్తే, చర్మం, ముఖం మీదనున్న మృతకణాలు తొలగిపోతాయి.


-ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీరమంతటా అప్లయి చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది.


-పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలపుదనం తగ్గుతుంది.


-ఎండలోంచి నీడలోకి వెళ్ళగానే పెరుగులో ఐస్ క్యూబ్ లు వేసి ఆ మిశ్రమంలో ముఖానికి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: