మంచినీళ్లను ఔషదామృతం అంటున్నారు వైద్యులు. ఎంత ఎక్కువ మంచినీరు తాగితే అంత ఆరోగ్యకరమని చెబుతారు. ఆరోగ్యం నుంచి అందం వరకూ అన్నింటిలోనూ నీరు ప్రధాన ప్రాత్ర పోషిస్తుందని చెవులువాచేలా బోధిస్తారు. కాని అవసరం కంటే అధికంగా నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారని కూడా తెలియజేస్తున్నారు వైధ్యలు. మీ శరీరానికి అవసరమయ్యే నీటికంటే ఎక్కువ తాగితే మూత్రపిండాలపై అధిక భారం పడుతుందంటున్నారు.


అలాగే శరీరంలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల కణాలు ఉబ్బే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా మెదడు భాగంలోని కణాలు ఉబ్బితే ఏకంగా కోమాలోకి వెళ్లిపోవడం ఖాయమంటున్నారు.


నీరు తాగడంలో కూడా కొన్ని పద్ధతులు పాటించాలి. దాహం వేసినపుడు మాత్రమే నీరు తాగితే సరిపోతుంది. అదే పనిగా నీళ్లు తాగడం మంచిది కాదు' అని చెబుతున్నారు. ఏ మనిషి ఎంత నీరు తాగాలో కూడా వివరించింది. వంద కిలోల బరువున్న మనిషి రోజుకు మూడు లీటర్ల నీరు తాగితే సరిపోతుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: