దేశంలో టెలీకాం వ్యవస్థంలో వొడ ఫోన్ మంచి పేరు సంపాదించింది. అంతేకాదు నాలుగు చిన్న సంస్థలు వోడాఫోన్ లో విలీనమైయ్యాయి. అయితే ఈ విలీనాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టడంతో  డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం కు ఎదురుదెబ్బ తగిలింది.  వోడాఫోన్ విలీనాలను తక్షణం ఆమోదించాలని, అంతకన్నా ముందు ఈ డీల్స్ లో భాగంగా ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన రూ. 2 వేల కోట్లను వోడాఫోన్ చెల్లించాలని సుప్రీంకోర్టు తుది తీర్పిచ్చింది. దీంతో ఆ సంస్థకు దిమ్మతిరిగినంత పనైంది.  

దేశంలో ఇప్పటికే టెలికాం వ్యవస్థ పై ఎన్నో రూమర్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో  స్పెక్ట్రమ్ వాడకం చార్జీలు, ఇతర సమస్యలపై ఈ కేసు తొలుత టీడీశాట్ కు రాగా, అక్కడ డాట్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.వివాదాలన్నీ పరిష్కారం అయ్యేవరకూ వోడాఫోన్ ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదని తీర్పిచ్చింది. దీనిపై డాట్ సుప్రీంను ఆశ్రయించగా, విలీనానికి అభ్యంతరాలు చెప్పవద్దని, ఇదే సమయంలో ప్రభుత్వ పన్నులనూ వసూలు చేయాలని చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: