ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న లెనోవా మరో అడుగు ముందుకు వేసింది. చైనా బ్రాండ్ లెనోవా ఇప్పటే కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా.. లెనోవా కంపేనీ తన ఉత్పాదనలైనటువంటి సరికొత్త ల్యాప్టాప్ ప్రవేశ పెట్టింది. ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో డిజైన్ చేయబడినవిగా కంపెనీ ప్రకటించింది. యోగా సిరీస్ లో వీటిని డిజైన్ చేసింది.
లెనోవో ‘యోగా 900’ పేరిట ఓ కన్వర్టబుల్ ల్యాప్టాప్, ‘ట్యాబ్ 3 ప్రో’ పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.1.22 లక్షలకు యోగా 900 ల్యాప్టాప్ లభిస్తుండగా, రూ.39,990 ధరకు ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
లెనోవో యోగా 900 ఫీచర్లు : 13.3 ఇంచ్ డిస్ప్లే, 3200 X 1800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 జీహెచ్జడ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ. యూఎస్బీ టైప్-సి పోర్ట్, విండోస్ 10 హోమ్.
యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్ల : 10.1 ఇంచ్ క్యూహెచ్డీ డిస్ప్లే, 2560 X 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.24 జీహెచ్జడ్ ఇంటెల్ ఆటం క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 10200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్