అప్పట్లో అతను యాహూ లో ఉన్నతమైన ఉద్యోగం చేసేవాడు , ప్రస్తుతం స్నాప్ డీల్ లో చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అతని పని తీరు గురించీ అతని నిజాయతీ గురించి ఎంతగానో చెప్పుకుంటారు అలాంటి ఆనంద్ చంద్ర శేఖరన్ ని తన మెసెంజర్ యాప్ కి సీయీవో గా చేస్తూ బాధ్యతలు అప్పగించింది ఫేస్ బుక్ సంస్థ. వంద కోట్లకి పైగా స్పార్ట్ ఫోన్ యూజర్ లని తన ఖాతాదారులు గా చేసుకున్న ఫేస్ బుక్ మెసెంజర్ తమ యాప్ ని మరింతగా విస్తరించాలి అనే ఉద్దేశ్యం తో ఈ నియామకాన్ని చేసింది. ఫేస్ బుక్ మెసింజర్ కు సేవలందించే అవకాశం రావడం తనకు సంతోషకరమని, 'కనెక్టింగ్ ఇండియా' అనే నినాదంతో ఇండియాలోని మరింత మందికి నెట్ కనెక్టివిటీని దగ్గర చేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: