ఎవ్వరూ ఊహించని, ఇవ్వలేని బంపర్ ఆఫర్ ని సిద్దం చేసింది  bsnl సంస్థ. కనక్షన్ తీసుకుంటే చాలు అద్దె కూడా ఇవ్వకండి అంటోంది. ఇప్పటికే రిలయన్స్ జియో కి షాక్ ఇస్తూ 249 కే అపరిమిత ఇంటర్నెట్ ని ఇచ్చిన వీరు ఇప్పుడు మరొక దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ప్రీపెయిడ్ కస్టమర్ లు వాడుకునే 2జీ , 3జీ లో వాయిస్ కాల్స్ ఉచితంగా ఇవ్వాలి అని దీనికి నామమాత్రం గా 2 రూపాయల రుసుం ఉంటుంది అని bsnl వర్గాలు చెబుతున్నాయి. ఏ నెట్వర్క్ కి అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు అనీ ఎలాంటి చార్జీలూ ఉండవు అనీ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. దేశం లో తొలి ఆఫర్ ఇదే అని ఆయన అంటున్నారు. తొలి దశలో సంస్థ నెట్ వర్క్ మెరుగ్గా ఉండే హిమాచల్ ప్రదశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఒడిసా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ ను తీసుకువస్తామని, ఆపై దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. జియో ఆఫర్లు 4జీ సపోర్ట్ చేసే ఫోన్లపైనే పనిచేస్తాయి. బీఎస్ఎన్ఎల్ తన తాజా ఆఫర్ ను అమలు చేస్తే, ఇండియాలోని ఏ మొబైల్ ఫోన్ నుంచైనా బీఎస్ఎన్ఎల్ సిమ్ తో ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. కాగా, ఈ అతి తక్కువ చార్జ్ ఆఫర్, మరో ఇంటర్నెట్ ప్యాక్ తో బండిల్డ్ రూపంలో రావచ్చని టెలికం నిపుణులు అంచనా వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: