పెద్ద నోట్ల రద్దు తరవాత భారత మొబైల్ కామర్స్ ప్లాట్ ఫార్మ్ పెటీయెం కి విపరీతమైన లాభాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక ప్రైవేట్ పార్టీ లో ఈ సంస్థ సీయీవో విజయ్ శంకర్ శర్మ సంస్థ ఎదుగుదల కి సంబంధించి ఒక ఉత్సాహ ప్రసంగం ఇచ్చారు. ఆ ఉత్సాహం లో ఆయన కాస్త ఓవర్ గా మాట్లాడారు అని కూడా తెలుస్తోంది. తమ దారికి ఎవరైనా అడ్డొస్తే పక్కకు వెళ్లిపోవాలని, లేదంటే చచ్చిపోతారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తమ సంస్థ చిన్న సైకిలు లేదా ఆటో లాంటి వాహనం కాదని, యుద్ధ ట్యాంక్ తో సమానమని, తమకు అడ్డొచ్చిన వాటిని యుద్ధ ట్యాంకులాగా పచ్చడి చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతామంటూ ఒక రేంజ్ లో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగా తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో, అది వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు శర్మ శ్రుతి మించిన వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: