ఐ ఫోన్ 8 స్మార్ట్ ఫోన్ లకి సంబంధించి మరొక అరవై మిలియన్ యూనిట్ ల OLED ప్యానల్స్ ని అందించడం కోసం సాంసంగ్ డిస్ప్లే కి కొత్త ఆర్డర్ వచ్చింది అంటున్నారు. సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ గ్రూపుల్లో సామ్సంగ్ డిస్ప్లే కూడా ఒకటి. ఈ డీల్లో భాగంగా దాదాపు 4.3 బిలియన్ డాలర్లను యాపిల్ కంపెనీ, సామ్సంగ్కు చెల్లించనుందట.దక్షిణ కొరియాకు చెందిన The Investor అనే ప్రముఖ వెబ్సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్, సామ్సంగ్ల మధ్య ఈ డీల్ 2016లోనే ఓకే అయ్యింది. ఐఫోన్8కు సంబంధించి తొలత 100 మిలియన్ OLED ప్యానల్ యూనిట్లను ఆర్డర్ చేసిన యాపిల్ డిమాండ్ ఎక్కువుగా ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో తాజాగా మరో 60 మిలియన్ యూనిట్ల OLED ప్యానల్స్ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.