ఐ ఫోన్ 8 స్మార్ట్ ఫోన్ లకి సంబంధించి మరొక అరవై మిలియన్ యూనిట్ ల OLED ప్యానల్స్ ని అందించడం కోసం సాంసంగ్ డిస్ప్లే కి కొత్త ఆర్డర్ వచ్చింది అంటున్నారు. సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ గ్రూపుల్లో సామ్‌సంగ్ డిస్‌ప్లే కూడా ఒకటి. ఈ డీల్‌లో భాగంగా దాదాపు 4.3 బిలియన్ డాలర్లను యాపిల్ కంపెనీ, సామ్‌సంగ్‌కు చెల్లించనుందట.దక్షిణ కొరియాకు చెందిన The Investor అనే ప్రముఖ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ఈ డీల్ 2016లోనే ఓకే అయ్యింది. ఐఫోన్8కు సంబంధించి తొలత 100 మిలియన్ OLED ప్యానల్ యూనిట్లను ఆర్డర్ చేసిన యాపిల్ డిమాండ్ ఎక్కువుగా ఉంటుందని భావిస్తోన్న నేపథ్యంలో తాజాగా మరో 60 మిలియన్ యూనిట్ల OLED ప్యానల్స్‌ను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: