టెలీకాం రంగం లో కొత్త విలీనం జరిగింది. ఎయిర్టెల్ సంస్థ టెలీనార్ ని తనలో విలీనం చేసుకోబోతోంది. ఈ కొనుగోలు లో టెలీనార్ ఆస్తులు కూడా బదలాయిస్తారు.దీంతో ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. కొన్ని రోజుల క్రిత‌మే ఐడియా - వొడాఫోన్‌ వీలీనం జరగనున్నట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కొన్ని రోజుల‌కే ఎయిర్‌టెల్‌-టెలినార్ ఇండియా కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తుండ‌డం ఆసక్తి రేపుతోంది. మార్కెట్లో రిల‌య‌న్స్ జియో నుంచి వ‌స్తోన్న పోటీ నేప‌థ్యంలో త‌మ‌ మార్కెట్‌ను మ‌రింత‌ విస్తరించుకోవ‌డంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.


రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ ఈ రోజు చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా, ఎంతమొత్తంలో కొనుగోలు చేయబోతుందనే విష‌యంతో పాటు ప‌లు విష‌యాల‌ను ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించ‌లేదు. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి చేయాల‌ని ఎయిర్ టెల్ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: