రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ల మీద ఇతర టెలీకాం కంపెనీలు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వివాదాల కమిటీ , అప్పీలేట్ ట్రిబ్యునల్ కి ఫిర్యాదు చేసింది. దీని మీద విచారించిన టీడీఎస్ఏ టీ ప్రమోషనల్ ఆఫర్ కింద జియో ఇస్తున్న ఫ్రీ సర్వీస్ విషయం లో స్టే ఇవ్వలేము అని తేల్చేసింది.  దీంతో రిలయన్స్ జియోకు ఊరట లభించింది. అయితే, ఫ్రీ ఆఫర్‌ల‌ను పునఃపరిశీలించాలని ట్రాయ్‌కు ట్రైబ్యున‌ల్‌ సూచించింది. జియో ఆఫ‌ర్ల అంశంపై త‌మ‌కు రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని చెప్పింది. కాగా, రిల‌య‌న్స్ జియో ఫ్రీ ఆఫ‌ర్లు ఈ నెల 31తో ముగుస్తోన్న విష‌యం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: