ఆన్ లైన్ అమ్మకాల దిగ్గజం అమెజాన్ కి పోటీ ఇవ్వడం కోసం ఫ్లిప్ కార్ట్ విస్తరణ ప్రణాళిక సిద్దం చేసింది. దాపు ఐదొందల మిలియన్ డాలర్లతో అంటే మన డబ్బుల్లో చెప్పాలి అనే సుమారు 3300 కోట్లు ఖర్చు పెట్టి భారత్ సబ్ సైడరీ ని సొంతం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇండియాలో అభివృద్ధి, విస్తరణ లక్ష్యంగా తాము నిర్దేశించుకున్న 2 బిలియన్ డాలర్ల నిధుల నుంచి ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు ఫ్లిప్ కార్ట్ వర్గాలు వెల్లడించాయి. ఇరు సంస్థల విలీనం చర్చలు 21వ తేదీన సాగాయని వెల్లడించిన ఓ ఉన్నతోద్యోగి, ఇప్పటికే తాము చైనాకు చెందిన టెన్సెంట్, మైక్రోసాఫ్ట్ ల నుంచి బిలియన్ డాలర్ల పెట్టుబడిని పొందామని తెలిపారు.

తనకు దేశంలోని అతిపెద్ద పోటీదారైన అమేజాన్ సంస్థ దూకుడుగా సాగుతున్న వేళ, తమ మార్కెట్ వాటాను సాధ్యమైనంతగా పెంచుకోవడమే లక్ష్యంగా ఫ్లిప్ కార్ట్ అడుగులు వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: