నాలుగైదు రోజుల టైం లో జియో ప్రైమ్ కి సంబంధించి గడువు ముగియ బోతోంది. దీనిని మరొక నెల రోజులు పొడిగించే పనిలో పడింది రిలయన్స్ కంపెనీ.  తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఏప్రిల్ 30 వరకూ జియో ప్రైమ్ గడువును పొడిగించాలని సంస్థ భావిస్తోందని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, అనుకున్న స్థాయిలో ప్రైమ్ సభ్యత్వాలను ఆకర్షించడంలో జియో వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రూ. 99 వన్ టైం ఫీజుగా చెల్లించేందుకు గడువును పెంచుతూ, అమల్లోని ఆఫర్లను 2018 వరకూ అందించాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: