సంచలనాల తో ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రిలయన్స్ జియో ఇప్పుడు మరిన్ని సంచలనాలకి తెర లేపింది. త్వరలో 4జీ సామర్ధ్యం కలిగిన ల్యాప్ టాప్ ని మార్కెట్ లోకి ప్రవేశ పెట్ట బోతోంది జియో.ఇందులో సిమ్కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఉండడం విశేషం. యాపిల్ సంస్థకు చెందిన 13.3 అంగుళాల మ్యాక్బుక్ను ఇది పోలి ఉంటుందని సమాచారం.
ప్రత్యేకతలు:
పుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఈ ల్యాప్టాప్లో వీడియో కాలింగ్ హెచ్డీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్బుల్ట్ మెమొరీ, మరో 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉన్నట్టు సమాచారం. అలాగే 4జీ, ఎల్టీఈ, బ్లూటూత్, హెచ్డీఎంఐ పోర్టు సదుపాయంతోపాటు రెండు యూఎస్బీ పోర్ట్స్ కూడా ఈ ల్యాప్టాప్లో ఉంటాయని తెలుస్తోంది. ధర వివరాలు మాత్రం తెలియరాలేదు.