స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ముగిశాయి. సెన్సెక్స్‌ 50 పాయింట్లు లాభపడి 31,159 తాజా గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 9,625 రికార్డు స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ప్ర‌భావంతో ఈ రోజు దేశీయ సూచీలు కొత్త రికార్డులను లిఖించాయని విశ్లేష‌కులు పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాలతో పాటు రుతుపవనాలు ముందుగానే వస్తుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చిందని అంటున్నారు. ఇక‌ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.64.62గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: