ఇప్పుడు జియోతో మొబైల్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. మొన్నటి వరకు కొన్ని నెట్ వర్క్ ల మద్య కాల్స్ రేట్ల తగ్గింపు వరకు పరిమితి ఉండేది..ఇప్పుడు 4జి నెట్ విషయంలో తీసుకు వస్తున్న సంచలన మార్పులకు అనుగుణంగా కొన్ని నెట్ వర్క్ లు కాంప్రమేజ్ కాక తప్పడం లేదు. తాజాగా తాజాగా వోడాఫోన్ తన వినియోగదారులకు మరో కొత్త ప్లాన్ ప్రకటించింది.
ఆకర్షణీయమైన మొబైల్ డేటా ఆఫర్లతో వస్తున్న జియోను ఎదుర్కొనే ప్రణాళికలో భాగంగా వోడాఫోన్ రూ.244 రీచార్జ్ పై 70 జీబి 4G డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. అంతే కాదు వోడాఫోన్ కొత్త ప్లాన్ కొత్త వినియోగదారులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. దీని ప్రకారం రోజుకు 1జీబీ డేటా ఉచితం. దీనికితోడు 70 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు.
ఇక రెండవ సారి రీచార్జి చేసుకున్న వారికి ఈ పథకంలో అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం కూడా కల్పించబడుతుంది. అయితే ఈ మొత్తం ప్లాన్ చెల్లు బాటు మటుకు 35 రోజులు మాత్రమే.