గత కొన్ని రోజుల నుంచి భారత దేశ మార్కెట్ లో రిలయన్స్ జియో చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు. కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులకు నాంది పలికిన జియో ఇప్పుడు మరో ఆఫర్ను ముందుకు తెచ్చింది. ఇంటెక్స్ 4 జీ స్మార్ట్ఫోన్ యూజర్లకు అదనంగా 25 జీబీ డేటాను అందించనున్నట్టు జియో ప్రకటించింది.
ఇప్పటికే ఉచిత ఆఫర్లతో జియో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న జియో సరికొత్త సంచలనాలతో మార్కెట్లోకి దూసుకెళ్తోంది. జియో దెబ్బకు ఇతర టెలికం కపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను మార్చుకొన్నారు. రిలయన్స్ చూపిన దారిలోనే ఇతర టెలికం కంపెనీలు కొనసాగుతున్నాయి.
రిలయన్స్ కొత్తగా ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. దీంతో ఇతర టెలికం కంపెనీలు కూడ కొత్తగా ఫోన్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు టెలికం వర్గాల్లో ప్రచారంలో ఉంది.