టెలికాం రంగంలో సంచలనంగా మారిన రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది.  దీపావళి పండగను పురస్కరించుకొని ‘ధన్‌ ధనా ధన్‌’ ఆఫర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫర్‌లో రూ. 399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో లభిస్తుంది.  'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్ లో భాగంగా దీనిని అందుకోవచ్చని తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఓచర్ల రూపంలో లభిస్తుంది. 

మూడు నెలల పాటు చెల్లుబాటయ్యే రూ. 399 రీచార్జ్ తో రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని, వీటిని నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని, ఈ ఆఫర్ నేటి నుంచి దీపావళి వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది.  గురువారం (అక్టోబర్ 12) నుంచి ప్రారంభమవుతున్న ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 18 వరకు అందుబాటులో ఉండనుంది. 
Image result for reliance jio diwali offer
కాగా, ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను గణనీయంగా తగ్గిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకున్న తరువాత, అత్యధికంగా లాభపడిన సంస్థగా రిలయన్స్ జియో నిలిచిన సంగతి తెలిసిందే. రూ. 399 ఆఫర్‌తో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఇప్పటికే 84 జీబీ డేటా (రోజుకు 1 జీబీ) ఇస్తున్నారు. దీంతో పాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌, ఉచిత కాలింగ్స్‌‌ను అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: