భారత దేశంలో దసరా, దీపావళి పండుగలకు వినియోగదారుల కోసం పెద్ద కంపనీలు ఎన్నో ఆఫర్లు పెట్టడం సహజం.  తాజాగా దేశీయ అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డును సష్టించింది. ధన త్రయోదశి సందర్భంగా ఒక్క రోజులోనే 3లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

ఒక్క రోజులోనే మూడు లక్షలకు పైగా ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గత నెలలో  దాదాపు 7లక్షల వాహనాలు అమ్మకాలు జరిపినట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 20,22,805 ద్విచక్రవాహనాల విక్రయాలు జరిపినట్టుగా తెలిపింది. క్రితం ఏడాదితో పోలిస్తే వాహన అమ్మకాల్లో దాదాపు 11శాతం వద్ధి నమోదు అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: