ఈ మద్య చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ట్యాబ్లెట్ వాడుతున్నారు. చిన్న పిల్లలు ఎంట్ర టైన్ మెంట్ కోసం ఆడుకోవడానికి వాడుతుంటే..పెద్దలు ఇంపార్టెంట్ మెసేజ్ లు, డేటా కోసం వాడుతున్నారు. ఇక చౌక ధరల్లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను మార్కెటింగ్ చేస్తున్న స్వైప్ టెక్నాలజీస్, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ట్యాబ్ ను విడుదల చేసింది.
ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో మీద రన్ అయ్యే ఈ ట్యాబ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 2జిబి ర్యామ్, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ ప్రధాన ఫీచర్లుగా కలిగి ఉంది. కంపెనీ స్వైప్ స్లేట్ ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. రూ. 8499 ధరలో ఇది ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో లభించనుంది.
స్వైప్ స్లేట్ ప్రొ ఫీచర్లు :
10.1 హెచ్డీ డిస్ప్లే
ఆండ్రాయిడ్ మార్షమిల్లౌ
1.1 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ స్టోరేజ్
32 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా
2 ఎంపీ సెల్ఫీ కెమెరా
మరోవైపు యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఫ్లిప్కార్ట్ 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది.