ఇప్పుడు భారత దేశంలో నెట్ వర్క్ ల మద్య విపరీతమైన పోటీ  నెలకొంది.  ఇక రిలయన్స్ జియో వచ్చినప్పటి నుంచి ఈ పోటీ మరీ ఉదృతం అయ్యింది.  అయితే జీయో 4G తో ఎంతో మంది కస్టమర్లను తన ఖాతాదారులకుగా చేసుంది. ప్రస్తుతం భారత టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్  4G  సేవలు పెంచాలను కుంటుంది.

ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తన 3జీ సర్వీసులకు మంగళం పలకబోతోంది. రానున్న 3 నుంచి 4 ఏళ్లలో 3జీ సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటి స్పెక్ట్రమ్ లను 4జీ సర్వీసులకు జత చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే 3జీ సర్వీసులపై ఎలాంటి ఖర్చులు చేయడం లేదని ప్రకటించింది. తమ నెట్ వర్క్ లో డేటా సామర్థ్యాన్ని మరింత అభివృద్ది చేయాలని చూస్తుంది.

దీని కోసం 4జీ టెక్నాలజీపై ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్టు భారతీ ఎయిర్ టెల్ దక్షిణాసియా, ఇండియా సీఈవో, ఎండీ గోపాల్ విట్టల్ తెలిపారు.కొన్ని టెలికాం సర్కిళ్లలో అత్యాధునిక 3జీ పరికరాలను అమరుస్తున్నామని... అవి 4జీకి సపోర్ట్ చేస్తాయని తెలిపారు. ఈ పరికరాలను తర్వాత రీప్లేస్ చేస్తామని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: