జియో పోటీని ఎదుర్కోవ‌డానికి టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే మ‌రో అద్భుత ఆఫ‌ర్‌తో ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందుకోసం మూడు భారీ రీఛార్జీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.   ఏడాది కాల పరిమితితో రూ.3,999కే 300 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అలాగే నేషనల్ రోమింగ్ ఉచితం. భారతీ ఎయిర్‌టెల్ మొత్తం మూడు ప్లాన్‌లు ప్రకటించింది. ఈ మేర‌కు త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో ఎయిర్‌టెల్ వెల్ల‌డించింది.  
 
రూ.3,999 ప్యాక్
ఎయర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్యాక్‌ కింద అపరిమితంగా లోకల్/ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. వాణిజ్య పరమైన కాల్స్ కూడా చేసుకోవచ్చు. 360 రోజులపాటు 300 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు.
 
రూ.1,999 రీచార్జ్ ప్యాక్
ఈ ప్యాక్ కాల పరిమితి 180 రోజులు. 125 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్ ఉచితం.
 
రూ.999 ప్యాక్
ఈ ప్యాక్ కాలవ్యవధి 90 రోజులు. 60 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్ /ఎస్టీడీ కాల్స్, వాణిజ్యపరంగానూ వాడుకునే వెసులుబాటు, నేషనల్ రోమింగ్ ఉచితం, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం

60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అదనంగా ఇస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: