రిలయన్స్ జియో పోటీని ఎదుర్కొనే వ్యూహంలో ఈ మద్య భారతి ఎయిర్  టేల్ కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది.  ఈ నేపథ్యంలో  టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ బంపరాఫర్ ప్రకటించింది.  తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని వినియోగదారుల కోసం 28 రోజులపాటు వాలిడిటీతో ప్రత్యేకమైన డేటా ప్లాన్‌ అందిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.  ఈ మద్య కాలంలో కొన్ని టెలికాం సంస్థలు అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలను విరివిగా అందిస్తున్నాయి. 

తాజాగా ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ, 3జీ/4జీ డేటా, అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాలను ఎయిర్ టెల్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూ లో రూ.198 ఆఫర్‌ అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్‌ యాప్‌లో బెస్ట్‌ ఆఫర్స్‌ ఫర్‌ యూ లో రూ.198 ఆఫర్‌ కనిపిస్తోంది.

ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను ఎయిర్ టెల్  అందిస్తోంది.  మై ఎయిర్‌టెల్‌యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌‌కి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎయిర్‌ వినియోగదారులు మై ఎయిర్‌టెల్‌యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: