గత కొంత కాలంగా భారత దేశంలో టెలికాం మార్కెట్లో రిల‌య‌న్స్ జియో సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.  దీంతో ఇతర నెట్ వర్కులు కూడా పోటీ పడి మరీ కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.  ఇప్పటికే వొడా, ఐడియా, ఎయిర్ టేల్ నెట్ వర్కులు బంపర్ ఆఫర్లు ప్రకటించగా..తాజాగా ఎయిర్ మరో కొత్త ఆఫర్ ప్రకటించింది.   రూ.349, రూ.549 ప్యాక్స్‌ల‌ను స‌వ‌రించింది.

రూ.349 తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల కాల ప‌రిమితితో ఇప్ప‌టివ‌ర‌కు 1.5 జీబీ, అపరిమిత కాల్స్ ను వినియోగ‌దారులు అందుకునేవారు. ఇక‌పై ఈ ప్లాన్‌తో రోజుకి 2జీబీ డేటా అందుకోవ‌చ్చు. అంటే వినియోగ‌దారులు ఈ ప్లాన్‌పై అదనంగా 500 ఎంబీ డేటా అందుకోవ‌చ్చు. ఇక రూ.549 తో రీఛార్జి చేసుకుంటే కూడా 500 ఎంబీ డేటాను ఎయిర్‌టెల్ అద‌నంగా అందిస్తోంది.

ఇప్పటి వరకు వినియోగ‌దారులు ఈ ప్లాన్‌తో 2.5 జీబీ డేటాను అందుకుంటుండ‌గా, ఇక‌పై 3 జీబీ అందుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా అందుకోవ‌చ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: