ఈ నెలాఖరులోగా 1000 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్—4) ఉద్యోగాల భర్తీ ప్రకటన జారీచేసే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్భాస్కర్ సూచనప్రాయంగా చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా ఈ ప్రకటనతోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రకటనల్ని జారీ చేయనున్నామన్నారు. గ్రూపు-2, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీలో జాప్యం జరిగినా ఇవి వెలువడే నాటికి... సెప్టెంబరు 30తో ముగియనున్న వయోపరిమితి పెంపు జీఓ ద్వారా ఎవరైతే అర్హత సాధిస్తారో వారందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.
ఈ విధానం ఏడాదిలోగా లేదా నోటిఫికేషన్ల జారీ (జీఓలో పేర్కొన్న 4009 ఉద్యోగాలకు) వరకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వాన్ని అవకాశాన్ని కల్పించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 1999 ఉద్యోగ ప్రకటన ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల్ని అనుసరించి కొత్తగా 317 మంది అభ్యర్థులకు ఇంటర్వూల్ని ఒకే బోర్డు ద్వారా జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచుతామన్నారు.