తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ముగిసి తరగతులు ప్రారంభమయ్యాయి. కోటి కలలతో ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులు ఇప్పుడిప్పుడే కోర్సుపై అవగాహన పెంచుకుంటున్నారు. ప్రొఫెసర్లు, సీనియర్ల సలహాలు తీసుకుంటున్నారు. గతేడాది వరకు ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో సెమిస్టర్ విధానం ఉండేది కాదు. ఈ విద్యాసంవత్సరం నుంచి మాత్రం మొదటి సంవత్సరం నుంచే సెమిస్టర్ విధానాన్ని అనుసరించనున్నారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ తొలి ఏడాదిలో రాణించేందుకు నిపుణుల సలహాలు...