రాష్ట్రంలో న్యాయవిద్య కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం (అక్టోబరు 21) ఖరారు చేసింది. ఈ నెల 29 నుంచి లాసెట్ కౌన్సెలింగ్ జరుగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, లాసెట్ కన్వీనర్ రంగారావు(కేయూ) తదితరులు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమై షెడ్యూల్ను ఖరారు చేశారు. రాష్ట్రంలో 22 న్యాయవిద్య కళాశాలలు ఉండగా వాటిల్లో ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు సీట్లు 3320, ఐదేళ్లవి 1740, ఎల్ఎల్ఎం సీట్లు 560 ఉన్నాయి. ఈనెల 29 నుంచి జరిగే ధ్రువపత్రాల పర