ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2015 ఫలితాల్లో బండ సునీల్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో 32వ ర్యాంకు సాధించారు. సివిల్స్ పరీక్షల్లో వరుసగా నాలుగుసార్లు పరాజయం ఎదురైనా నిరుత్సాహపడలేదు.. కఠోర దీక్ష, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్తో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. సునీల్ కుమార్ రెడ్డి విజయ ప్రస్థానం ఆయన మాటల్లోనే..