ఉస్మానియా విశ్వవిద్యాలయం వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించే శతాబ్ది ఉత్సవాలను దేశ చరిత్రలో చిరస్థాయిలో నిలిచేలా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు వర్సిటీ ద్వారా కోటి మందికి ఉన్నత విద్య లభించిందని అందువల్ల ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శతాబ్ది ఉత్సవాలపై విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ఓయూ ఉపకులపతి రామచంద్రం, రిజిస్ట్రార్ సురేష్కుమార్, ఉత్సవాల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు తదిత