ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం(జనవరి 22) నిర్వహించిన తుది రాత పరీక్షకు 72,045 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లోని కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్ష రాసేందుకు 72,324 మంది అభ్యర్థులు అర్హత సాధించగా... వారిలో 279 మంది గైర్హాజరయ్యారు. ప్రశ్నపత్రానికి సంబంధించిన సమాధానాలను విడుదల చేసినట్లు ఏపీ పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ తెలిపారు. ఏవైనా అభ్యంతరాలుంటే జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పోలీసు నియామక బోర్డుకు మెయిల్ పంపించాలని సూచించారు. 15 రోజుల్లోగా తుది రాత పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నామన్నారు. సమాధానాల కోసం ఏపీ పోలీసు నియామక బోర్డు వెబ్‌సైట్‌లో చూడొచ్చన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: