త్వరలో జరిగే గ్రూపు-2 రాత పరీక్ష అనుమతి పత్రాలను (హాల్టికెట్) వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి వెల్లడించారు. హైదరాబాద్లో కేంద్రం కావాలని మొదటి ఆప్షన్ ఇచ్చిన వారి హాల్టిక్కెట్లను ఫిబ్రవరి 14 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చుని ఆదివారం జారీచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరి 26వ తేదీన గ్రూపు-2 స్క్రీనింగ్ టెస్ట్ను రాష్ట్ర వ్యాప్తంగా 1600 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో వందకుపైగా కేంద్రాల్ని ఏర్పాటుచేస్తున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.