డీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి డీఈఈసెట్ను ఆన్లైన్లో నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు సోమవారం(ఫిబ్రవరి 13) సమావేశమై చర్చించారు. 2016-17కి ప్రవేశ ప్రకటన జారీ చేయకపోవడంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాశాఖ మాత్రం 2015-16 తరగతులు 2015 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయని, దాంతో 2016-17 సంవత్సరానికి ప్రవేశాలు సాధ్యం కాదని కోర్టుకు విన్నవించింది.
ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరంలో ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నారు. ఈ సారి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రవేశ విధానాల్లో కొన్ని మార్పులు చేసేందుకు గతంలోని ఉన్న ఉత్తర్వులను మార్చి కొత్త జీఓలు విడుదల చేయాలని భావిస్తున్నారు. మరోసారి కమిటీ సమావేశమై ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి ఆమోదం తీసుకోనుంది. ఈ సమావేశంలో విద్యాశాఖ కమిషనర్ కిషన్, డీఈఈసెట్ కన్వీనర్ శేషుకుమారి, ఎస్సీఈఆర్టీ సంచాలకుడు జగన్నాథరెడ్డితోపాటు సత్యనారాయణరెడ్డి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.