తెలంగాణ రవాణా శాఖలో ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకోసం గతేడాది జులైలో జరగిన రాత పరీక్ష ఫలితాలు మార్చి 8న విడుదలయ్యాయి. మార్చి 14న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. రాత పరీక్ష ఆధారంగా మొత్తం 120 మందిని ఎంపికచేశారు. ఈ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితా వెబ్‌సైట్లో పెట్టినట్లు పేర్కొన్నారు. పత్రాల పరిశీలన నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ప్రతిభ భవన్‌లో ఉంటుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: