గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై 400 అభ్యంతరాలు.. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష ప్రశ్నపత్రంపై అభ్యర్థుల నుంచి 400 వరకు అభ్యంతరాలు వచ్చాయి. నిపుణుల కమిటీ వీటిని వచ్చే వారం పరిశీలించనుంది. మరోవైపు ఏఈఈ ప్రశ్నపత్రాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన వేలాది అభ్యంతరాలను కమిటీ పరిశీలించింది. త్వరలో తుది 'కీను ఖరారు చేయనున్నారు. 2011 గ్రూపు-1 ప్రధాన పరీక్షల ఫలితాల వెల్లడికి అవసరమైన చర్యలు పూర్తి కావొచ్చాయి. త్వరలో జరిగే కమిషన్ సమావేశంలో ఈ రెండు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: