నిరుద్యోగులకు శుభవార్త. పదో తరగతి విద్యా ర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.తపాలాశాఖలో గ్రామీణ కాల్‌ సేవక్స్‌(గ్రామీణ పోస్ట్‌మ్యాన్స్‌) గ్రామీణ పోస్ట్‌ మాస్టర్స్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1126 ఉద్యోగా లు ఉండగా రాజమహేంద్రవరం డివిజన్‌కు సంబంధించి 8 గ్రామీణ పోస్ట్‌మాస్టర్స్‌, 14 గ్రామీణ పోస్ట్‌మ్యాన్స్‌ ఖాళీలున్నాయి.


ఇవ న్నీ పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. హిందీ మార్కులు లెక్కించరు. 18నుంచి40ఏళ్ల వయసు గలవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫీజు మినహాయిం పుఉంది.మిగతావారు రూ.వంద చెల్లించాలి. మరింత సమాచారంకోసం www.appost .in/gdsonlineవెబ్‌సైట్‌ చూడవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: