అసిస్టెంట్ ఇంజినీర్ ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 25న రాత్రి ప్రకటించింది. 6757 మంది అభ్యర్థులు పేపర్ల వారీగా సాధించిన మార్కులు, మొత్తం మార్కులు ఇందులో ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ఇంజినీర్ (ఎన్విరాన్మెంటల్) ప్రధాన రాత పరీక్షలో మార్కులను పొందిన 7027 మంది జాబితాను కూడా ఎపీపీఎస్సీ వెల్లడించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పరీక్షలో అభ్యర్థులకు వచ్చిన మార్కులను కూడా ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వారంలోగా వెల్లడిస్తామని ఎపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి తెలిపారు.