జాతీయ‌స్థాయి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ప్రముఖ ప‌రిశోధ‌నా సంస్థల్లో ప్రవేశాల‌కు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావ‌కాశాల‌కు గాను నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌)-2017 ఫ‌లితాలు మార్చి 26 విడుద‌య్యాయి. ఈ ఫలితాలను రూర్కీ ఐఐటీ విడుదల చేసింది. గేట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచింది. మే 5 వరకు ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. గ‌త ఫిబ్రవరిలో జ‌రిగిన ఈ ప‌రీక్షకు దేశవ్యాప్తంగా 8 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల‌ నుంచి సుమారు 20 వేల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: