ఏపీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను మార్చి 30 లేదా 31న వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఓఎంఆర్ షీటులో హాల్టిక్కెట్ నెంబరు, సెట్ కోడ్ వృత్తాల్ని తప్పుగా నింపిన 12 వేల మంది గ్రూప్-2 అభ్యర్థుల ఆశలు అడియాశలయ్యాయి. వీరి జవాబుపత్రాలు (ఓఎంఆర్ షీట్లు) కంప్యూటర్ స్కానింగులో కుదరనందున మూల్యాంకనం చేయలేదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి. చేసిన తప్పులను సరిదిద్దాలని అభ్యర్థులు గతంలోనే ఏపీపీఎస్సీని కోరారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని అధికారవర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 26న నిర్వహించిన గ్రూపు-2 ప్రాథమిక పరీక్షకు 4.82 లక్షల మంది హాజరయ్యారు.