ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలిసారిగా వార్షిక ఉద్యోగ నియామకాల పట్టిక ద్వారా 42 ప్రకటనలను(నోటిఫికేషన్ల) ఈ ఏడాది జులై నుంచి జనవరి (2018) మధ్య విడుదల చేయనుంది. ఈ కొత్త ప్రకటనలకు అనుగుణంగా రాత పరీక్షలు అక్టోబరు నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు జరగనున్నాయి. ఈ తేదీలను అనుసరించి ప్రణాళికాబద్ధంగా అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ పట్టిక ఉపయోగపడుతుందని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇప్పటికే జారీచేసిన ఉద్యోగ ప్రకటనలను అనుసరించి భర్తీకాకుండా ఉన్న ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయి. వీటితోపాటు ప్రభుత్వ ఆమోదంతో వచ్చే ఖాళీల భర్తీకి చర్యల్ని తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: