వచ్చే నెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 20లోగా ఫీజు చెల్లించాలని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్‌ తెలిపారు. పరీక్ష ఫీజు రూ.360, ప్రతి సబ్జెక్టుకు రూ.120 వంతున చెల్లించాలన్నారు. రీకౌంటింగ్‌కు రూ.200, రీ-వాల్యూయేషన్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు వచ్చే నెల 15 నుంచి 23 వరకు జరుగుతాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: