తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో మొదటి స్థానంలో మేడ్చల్ జిల్లా, చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా ఉండగా.. సెకండియర్‌లో మొదటి స్థానంలో మేడ్చల్ జిల్లా నిల్చినట్లు కడియం తెలిపారు. అదేవిధంగా మే 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: