పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ తుది పరీక్ష ఫలితాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. 4,548 పోస్టుల భర్తీకి గత ఏడాది జూలైలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం అందులోనే మరో 800 మందికి అవకాశం కల్పించబోతోంది. ఈమేరకు పోలీసు శాఖ బలాన్ని మరింత పెంచుకునేందుకు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అదనపు కానిస్టేబుళ్ల నియామకానికి అవకాశం ఇవ్వాలని డీజీపీ సాంబశివరావు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో సోమవారం డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రభుత్వ సమ్మతిని మంత్రి పోలీసు బాస్‌కు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: