ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎ్‌సఐసెట్‌ ప్రవేశ పరీక్ష ఈ నెల 18న నిర్వహించనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న, టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓంప్రకాశ్‌ తెలిపారు. 77,302 దరఖాస్తులు అందాయని, రూ.5 వేల అపరాధ రుసుముతో ఈ నెల 14 వరకు దరఖాస్తుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు ఉదయం 8.30లోగా పరీక్ష కేంద్రాలకు చేరుకుని బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేసుకోవాలన్నా రు. నిర్ణీత సమయం(ఉదయం 10 గంటల) తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్నారు. 21న వెబ్‌లో ఐసెట్‌ ప్రాథమిక కీ, 30న ఫైనల్‌ కీ విడుదల చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: