గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను జూలై 15, 16 తేదీలకు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. 982 పోస్టులకు గతేడాది నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీపీఎస్సీ... ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన స్ర్కీనింగ్ టెస్ట్ నిర్వహించింది. వీటి ఫలితాలను... ఏప్రిల్ తొలివారంలో విడుదల చేసింది. నోటిఫికేషన్లో ప్రకటించినట్లుగానే మే 20, 21 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. కాగా, స్ర్కీనింగ్ ఫలితాలకు, మెయిన్స్ పరీక్షలకు కేవలం నెలన్నర రోజులు మాత్రమే సమయం ఉండడం, సిలబ్సలో పేర్కొన్న మేరకు స్టడీ మెటీరియల్ మార్కెట్లో లభ్యం కాకపోవడంతో... అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా... ప్రిపరేషన్కు తగిన సమయం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తమైంది.