నగరంలో శుక్రవారం జరగబోయే తె లంగాణ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్థుల కోసం ప్రత్యేకంగా వెయ్యి బస్సులు నడ పనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ ఈడీ పురుషోత్తం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేట ర్జోన్ పరిధిలోని ఒక్కొక్క డిపో నుంచి 40 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్లు తెలిపా రు. నగరంలోని 94 సెంటర్లకు ప్రత్యేక బస్సు లు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల నిర్వహణ కోసం అధికారులు బస్టా పుల వద్ద విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రత్యేక బస్సుల కోసం కోఠి - 9959226160, రేతిఫైల్ - 9959226154 ప్రాంతాల్లో కమ్యూని కేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపా రు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జో నల్ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ 6 జీపులలో అం దుబాటులో ఉంటారన్నారు.