గ్రూప్-3 స్ర్కీనింగ్ టెస్ట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో కలిపి 1055 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గత నెల 23న 1430 సెంటర్లలో గ్రూప్-3 పరీక్ష నిర్వహించింది. జిల్లాల వారీగా నోటిఫై చేసిన పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులకు మెయిన్స్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. పరీక్షను 150 మార్కులకు నిర్వహించగా... నెగిటివ్ మార్కుల కారణంగా మెయిన్స్కు కటాఫ్ మార్క్ తక్కువగా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా... 1999 నాటి గ్రూప్-2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఫైనల్ సెలెక్షన్ జాబితాను కూడా శుక్రవారం విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ ప్రయత్నాలు చేస్తోంది.