బ్యూటీషియన్‌ శిరీష కుమార్తె దివ్యకు డిగ్రీ వరకు కళాశాల ఫీజులు చెల్లిస్తానని సీఐడీ ఐజీ పి.వి.సునీల్‌కుమార్‌ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య కళాశాలకు ఆదివారం వచ్చిన ఐజీ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇటీవల మృతి చెందిన బ్యూటీషియన్‌ శిరీష విషయం తెలిసి తన మనస్సు చలించిందన్నారు. శిరీష కుమార్తె దివ్య ఆచంట మండలం వల్లూరులోని తన నాయనమ్మ, తాతయ్యల వద్ద ఉంటూ.. పాలకొల్లు ఆదిత్య పాఠశాలలో 8వ తరగతి చదువుతోందని తెలిసిందని చెప్పారు. మానవతా దృక్పథంతో దివ్యకు డిగ్రీ వరకు కళాశాల ఫీజులు, ఖర్చులను తాను భరిస్తానని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: