ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 982 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకోసం ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా శని, ఆదివారాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 49,106 మంది మెయిన్స్కు అర్హత సాధించగా... అందులో 45వేల మందికిపైగా (సుమారు 92శాతం) పరీక్షకు హాజరయ్యారు. ఒకేసారి ఇన్ని వేలమందికి ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం దేశంలోనే వినూత్న పద్దతి అని ఏపీపీఎస్సీ కార్యదర్శి వై.వి.ఎస్.టి.సాయి పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు, వాటి జవాబులను ఒకటి, రెండు రోజుల్లో ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచుతామన్నారు. ఆన్సర్ కీని వెబ్సైట్లో పెట్టిన ఏడు రోజుల్లోగా అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియచేయాలన్నారు. ఇందుకు ఉపయోగించాల్సిన ఫార్మాట్ను కూడా వెబ్సైట్లోనే అందుబాటులో ఉంచుతామని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.