బీసీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న తమకు.. పురుగుల భోజనం పెడతారా అంటూ ఆందోళన బాట పట్టిన విద్యార్థులు వీరు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద వీరు నిరసన వ్యక్తం చేశారు. వార్డెన్కు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా ఫలితం లేదని, పిల్లలు ఆకలితో అలమటించాల్సి వస్తోందని వాపోయారు. ఎంఈవో హాజీమలాన్మీయకు వినతి పత్రం అందించారు.